బెంగళూరు, అక్టోబర్ 09 : పులి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఓ ఉద్యోగి ... వివరాల్లోకి వెళితే... బెంగళూరులోని బన్నర్ ఘట్టా జాతీయ పార్కులో కేర్ టేకర్ గా పనిచేస్తున్న 40 ఏళ్ల ఓ వ్యక్తి శనివారం సాయంత్రం పులులను ఉంచిన ఎన్ క్లోజర్ ను తనిఖీ చేస్తుండగా హఠత్తుగా రెండు తెల్ల పులులు అతనిపై దాడి చేయడంతో అక్కడిక్కడే ఆ వ్యక్తి మరణించినట్లు పార్క్ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ జయరామ్ వెల్లడించారు. ఈ ఘటన నిన్న సాయంత్రం 5.45కు జరిగినట్లు సమాచారం. బన్నర్ ఘట్టా పార్క్ ను 1970 లో ప్రారంభించగా, 1974 లో దీనిని నేషనల్ పార్క్ గా ప్రకటించారు.