పరాజయమైన పాట్నా...

SMTV Desk 2017-10-09 11:44:44  pro kabaddi updates, patnaa, gujarath, pune, jaipur.

జైపూర్, అక్టోబర్ 9 : ప్రో కబడ్డీ లీగ్‌ మ్యాచ్ లో పాట్నా పైరేట్స్ పై గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్‌ 33-29 తేడాతో 13వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్ ఆటగాళ్లలో రాజపుత్ (6), సచిన్ (5) మిఘాని (4) రాణించగా.. పాట్నా జట్టులో గోయత్ (6), విజయ్ (6) ఆకట్టుకున్నారు. ఈ విజయంతో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్‌ “గ్రూప్ ఏ” 77 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా “గ్రూప్ బి” లో 67 పాయింట్లతో పాట్నాపైరేట్స్ రెండవ స్థానంలో ఉంది. తరువాత జరిగిన మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ పై పుణేరి పల్టన్ 38-30 పాయింట్లతో గెలుపొంది౦ది. ప్రారంభం నుండే దూకుడు ప్రదర్శించిన పూణే టీంలోని రాజేష్ ముండాల్ (10), దీపక్ హూడా (8) తమ జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు. జైపూర్ టీంలో నితిన్ రావాల్(7) తో పోరాడినప్పటికీ మిగతా వాళ్ళు అంతగా రాణించలేదు. ప్రస్తుతం జైపూర్ పింక్ పాంథర్స్ “గ్రూప్ ఏ” లో 50 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉండగా, తాజా విజయంతో పుణేరి పల్టన్ “గ్రూప్ బి” లో 63 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది.