సొంత ప్రాంత ప్రజల మధ్య మోదీ ప్రసంగం

SMTV Desk 2017-10-09 11:17:12  Gujarath Wadhnagar, Prime Minister of India mode Tour, Speech

గుజరాత్, అక్టోబర్ 09 : దేశాన్ని దోచుకున్న వారంతా ఏకమైన నిజాయితీయే గెలుస్తుందన్న విశ్వాసంతో ముందుకు వెళ్తున్నట్లు భారత ప్రధాని మోదీ అన్నారు. సొంత రాష్ట్రం గుజరాత్ లో రెండో రోజు కూడా సుడిగాలి పర్యటన జరిపారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.... సాధారణ జీవితంలో ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంతటి ప్రేమ, ఆప్యాయత లభించడం గుండెలను తాకే సంఘటన అంటు మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సామర్థ్యమే మరింత ఉత్సాహంతో జాతిని సేవించేందుకు కొత్త శక్తిని ఇచ్చిందన్నారు. నాకు తెలిసిన వారు ఎంతో మంది నన్ను అభినందించడానికి వచ్చారు. వారిని చూసి నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని ఉద్వేగభరితంగా చెప్పారు. ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యూపీఏ 10 ఏళ్ల పాలనపై మరోసారి విమర్శలు గుప్పించిన ప్రధాని, సొంత ప్రాంతాల ప్రజలు అందించిన ఆశీర్వాదాలతోనే మరింత శక్తిని జోడించి దేశ సేవాలో మమేకమవుతానని హామీ ఇచ్చారు.