హైదరాబాద్, అక్టోబర్ 8 : బీఎస్ఎన్ఎల్ లో మెగా మేళా నిర్వహించనున్నట్లు తెలంగాణ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్.అనంతరామ్ వెల్లడించారు. ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు జరగనున్న ఈ మేళాలో వినియోగదారులు 3జీ స్మార్ట్సిమ్, కస్టమర్ సర్వీస్సెంటర్, ఫ్రాంచైజీ, రిటైల్ ఔట్లెట్లను ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు. వీటితో పాటు ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్, ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లను, 3జీ సిమ్తో 350ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తున్నామన్నారు.