హైదరాబాద్, అక్టోబర్ 8 : టీటీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయిన తరుణంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఇంటి ముందుకు రావడం చర్చలకు దారీ తీస్తుంది. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.. తెరాస ప్రభుత్వం అభివృద్దిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇలా మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతేకాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి వ్యక్తిగత విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదంటూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తానూ వస్తున్న రోడ్డులో ట్రాఫిక్ కారణంగా వేరే మార్గంలో వెళ్ళవలసి వచ్చిందని, అంతేకాని సీఎం చంద్రబాబును కలవలేదని స్పష్టం చేశారు.