హైదరాబాద్, అక్టోబర్ 08 : హైదరాబాద్ లోని కూకట్పల్లిలోని ఎల్లమ్మ బండ రోడ్డు మార్గంలో ఈ ఉదయం ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. ఉషా ముళ్లపూడి కమాన్ నుంచి ఎల్లమ్మ బండకు వెళ్లే మార్గంలో తెలంగాణ కూడలి భూగర్భంలోని గోదావరి పైప్ లైన్ పగిలిపోయి భారీ గొయ్యి ఏర్పడింది. నీటి పైప్ లైన్ పగిలి గొయ్యి నుంచి భారీగా నీరు ఉబికి వస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఆ మార్గంలో వెళ్లేవారిని అప్రమత్తం చేశారు. అలాగే జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే స్పందించి వృధాగా పోతున్న నీటిని అదుపులోకి తెచ్చారు.