రాజమండ్రి, అక్టోబర్ 8 : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో తనను పాదయాత్ర చేయకుండా ఎందుకు అడ్డుకు౦టున్నారో అధికారికంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్రం చంద్రబాబు ఎస్టేట్ కాదని, కేవలం ఆయన తన ఒక ట్రస్టీ మాత్రమేనని పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ కార్యక్రమాలకు అనుమతులు ఉండవు కాని నా కార్యక్రమాలకు మాత్రమే ఎందుకు..? అంటూ ప్రశ్నించారు. తనపై కేసులు పెడతామంటూ బెదిరింపు చర్యలకు పాల్పడడం కాదు, దమ్ముంటే కార్యాచరణకు దిగాలంటూ సవాల్ విసిరారు.