క్రికెటర్ జడేజా కు షాక్...

SMTV Desk 2017-10-07 17:42:17  Cricketer Ravindra Jadeja, Juddus Food Field Restaurant, food inspector.

ముంబై, అక్టోబర్ 7 : భారత క్రికెటర్ రవీంద్ర జడేజాకు ఊహించని షాక్ తగిలింది. రాజ్‌కోట్‌లో జడేజాకు చెందిన (జేఎఫ్ఎఫ్) జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్ రెస్టారెంట్‌లో కల్తీ ఆహారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కస్టమర్లు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తనిఖీలు నిర్వహించగా కల్తీ ఆహార పదార్థాలు వెలుగు చూశాయి. అయితే ఈ రెస్టారెంట్‌కు జడేజా సోదరి నయన అనిరుద్దీన్ జడేజా.. యజమానిగా వ్యవహరిస్తుండగా ఆమెకే ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆహార పదార్థాలలో కృత్రిమ రంగులు వాడుతున్నారని, చాలా కాలం నిల్వ ఉన్న బేకరీ పదార్థాలు అమ్ముతున్నట్లు నిర్ధారించామని అధికారులు తెలిపారు. జేఎఫ్ఎఫ్ తోపాటు మరికొన్ని రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. కాగా, 2012లో జడేజా ఈ రెస్టారెంట్ ప్రారంభించగా.. గత సంవత్సరం ఇది అక్రమ నిర్మాణమని అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ యధావిధిగా రెస్టారెంట్ కొనసాగుతుంది.