రాంచీ, అక్టోబర్ 7 : వన్డే సిరీస్ లో ఆస్ట్రేలియాను 4-1 తో చిత్తు చేసిన కోహ్లి సేన వన్డేల్లో అగ్రస్థానం చేజిక్కించుకుని ఆస్ట్రేలియాపై విజయంతో వన్డేల్లో ఒక టార్గెట్ను పూర్తి చేసిన కోహ్లీసేన.. టీ-20ల్లో రెండో ర్యాంకుపై గురిపెట్టింది. పొట్టి ఫార్మాట్లో ప్రస్తుతం ఐదో ర్యాంకులో ఉన్న భారత్ ఈ సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేస్తే పాకిస్థాన్ను వెనక్కునెట్టి రెండో స్థానం కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ నెంబర్వన్ స్థానంలో ఉండగా ఆసీస్ ఏడో ర్యాంకులో ఉంది.