హైదరాబాద్, అక్టోబర్ 07 : సింగరేణి ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా వరల్డ్కప్ నే గెలుపొందినట్లు భావిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి. హనుమంతురావు విమర్శను గుప్పించారు. ఆయన కూతురిని గెలిపించాలని కేసీఆర్ ఆ ఎన్నికల్లో నేరుగా జోక్యం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కేవలం తెరాసకు తమకు నాలుగు వేల ఓట్ల తేడానే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో ఉంటే ఇప్పుడు ఆయన గురించి కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. భారత ప్రధాని నరేంద్రమోదీని ఆకర్షిచేందుకే ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.