ముజఫర్ నగర్, అక్టోబర్ 7 : ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో బులంద్ షహర్ ఘటన మరవకముందే ముజఫర్ నగర్ లో మరో ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... ముజఫర్ నగర్ కు చెందిన దంపతులు తమ మూడు నెలల చిన్నారిని ఆసుపత్రిలో చూపించి ఇంటికి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తుండగా దారిలో నలుగురు దుండగులు వారిని అడ్డగించారు. తుపాకి చూపి బెదిరించి పాపను లాక్కొని, ఆమె భర్తను తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత వారిని ఒక పొలంలోకి లాక్కొని వెళ్లి అతన్ని చెట్టుకు కట్టేసి ఆమెపై ఆ నలుగురు సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపుతామని బెదిరించి ఆ దుండగులు అక్కడినుంచి పారిపోయారు. తరువాత అటు వైపుగా వెళ్తున్న రైతులు వారిని కాపాడి ఆస్పత్రికి తీసుకొని వచ్చారని పోలీసులు వెల్లడించారు.