పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటా : పురందేశ్వరి

SMTV Desk 2017-10-07 13:29:45  BJP Party, Daggubati Purandeswari

అమరావతి, అక్టోబర్ 7 : బీజేపీ నేత పురందేశ్వరి తన రాజకీయ భవిష్యత్తులో పోటీ చేయనున్న స్థానం గురించి ఒక స్పష్టతను ఇచ్చింది. ఆమె వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుండి పోటీ చేయనున్నారని పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో ఆమె ఈ విషయంపై స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేకంగా హిందూపురం నుండి పోటీ చేయాలని భావించడం లేదని.. ఇలా చేసి పార్టీ కేడర్ మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురానని స్పష్టం చేసింది. పార్టీ ఏ స్థానం నుండి పోటీ చేయమంటే ఆ స్థానం నుండి పోటీ చేస్తానని.. పార్టీ నిర్ణయానికి కట్టుబడే ఉంటానని పేర్కొన్నారు.