న్యూఢిల్లీ, అక్టోబర్ 07 : కార్యకలాపాల్లో మరింత పారదర్శకత కోసం న్యాయ మూర్తుల పదోన్నతలు, బదిలీలు వంటి అంశాలపై సుప్రీంకోర్టు, కొలీజియం తీసుకున్న నిర్ణయాలను కోర్టు వెబ్ సైట్ లో పొందు పరచాలని ఉన్నత న్యాయ స్థానం నిర్ణయించింది. పదోన్నతులు, బదిలీలకు దారి తీసిన పరిస్థితులు కారణాలు సహా ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి అందజేసిన సూచనలు, సలహాలు వెబ్ సైట్ లో పొందుపరచనున్నారు. కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, గోప్యతను కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెబ్ సైట్ లో పొందుపరిచిన తీర్మానంలో సుప్రీంకోర్టు తెలిపింది. ఇటీవల జరిగిన పలు న్యాయ అధికారులు, న్యాయ మూర్తుల నియామకాలకు సంబంధించిన సంప్రదింపుల వివరాలను కూడా సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో ఉంచింది.