ఘోర రోడ్డు ప్రమాదం... బస్సుపైకి దూసుకెళ్లిన రైలు..

SMTV Desk 2017-10-06 19:19:10   Russia, Moscow city, train accident.

మాస్కో, అక్టోబర్ 6 : రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రైలు బస్సుపైకి దూసుకురావడంతో 19 మంది ప్రయాణికులు మరణించిన సంఘటన మాస్కోలోని పోక్రోవ్‌ పట్టణ౦లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. మాస్కో నగరానికి తూర్పున ఉన్న పోక్రోవ్‌ పట్టణ౦లో తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో.. ఓ బస్సు లెవెల్ క్రాసింగ్‌ను దాటుతుండగా ఒక్కసారిగా బస్సుపైకి రైలు దూసుకొచ్చింది. ఈ ఘటనలో 19 మంది మరణించగా, మరికొందరు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారిని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన దర్యాప్తు కమిటీ కేవలం బస్సులోని ప్రయాణికులు మాత్రమే మరణించారని, రైలు ప్రయాణికులేవరికి ఎలాంటి హానీ జరగలేదని పేర్కొన్నారు.