హైదరాబాద్, అక్టోబర్ 06 : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెరాస అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయాన్ని అందించినందుకు కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులకు ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేరుస్తామని తెలిపారు. అన్ని పార్టీలు ఏకమైనా టీబీజీకేఎస్ కు 45 శాతం ఓట్లు రావడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలలో ప్రజలు టీఆర్ఎస్ నె గెలిపించడంతో ఈ సారి సింగరేణి ఎన్నికల్లో కొందరు విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేశారన్నారు. చెప్పాలంటే వారసత్వ ఉద్యోగాలను పోగొట్టింది వారే, వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరించేందుకు ప్రయత్నించామని, ఇంత పెద్ద మెజారిటీతో గెలిచిన సంఘం ఏదీ లేదన్నారు. ఇప్పటికైనా అసత్యాలు వీడి ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు.