స్టాక్హోమ్, అక్టోబర్ 6 : అణ్వాయుధ నిర్మూలన కోసం పోరాటం చేస్తున్న ఐసీఏఎన్(అంతర్జాతీయ అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమం) సంస్థకు 2017 నోబెల్ శాంతి పురస్కారం లభించింది. అణ్వాయుధాల వ్యాప్తిని అరికట్టి.. అణు నిల్వలను పూర్తిగా నిర్మూలించాలని ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ చట్టాలననుసరించి న్యూక్లియర్ వెపన్స్ను అదుపు చేయాలన్న సిద్ధాంతాలతో ఐసీఏఎన్ ఉద్యమాలు చేపడుతున్నది. దీంతో నోబెల్ కమిటీ.. ఐసీఏఎన్కు శాంతి బహుమతిని ప్రకటించింది. ఈ సందర్భంగా అన్ని దేశాలు అణు నిల్వలను(ఆయుధాలను) నిర్మూలించడానికి సహకరించాలని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది.