కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్‌.. ఏడుగురి మృతి

SMTV Desk 2017-10-06 14:49:37  Arunachal Pradesh, Indian Air Force, Rescue crew, MI 17 helicopter.

అరుణాచల్‌ప్రదేశ్‌, అక్టోబర్ 6 : భారత వాయుసేనకు చెందిన ఓ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటన అరుణాచల్‌ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ విషయంపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్పందిస్తూ.. భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతంలో వాయు నిర్వహణ బృందాన్ని తీసుకెళ్తున్న ఎంఐ-17 హెలికాప్టర్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది మృతి చెందగా మరో ఇద్దరు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశాలను జారీ చేసినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించింది.