నల్గొండ, అక్టోబర్ 06 : వ్యవసాయానికి 12 గంటల విద్యుత్ మాత్రమే సరఫరా చేసే అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి హరీష్రావు హామీ ఇచ్చారు. నల్గొండలో రైతు బజార్ ను ప్రారంభించిన అనంతరం కొందరు రైతులు 24 గంటల కరెంటు వద్దంటూ మంత్రి ముందు నినాదాలు చేశారు. వారికి నచ్చజెప్పిన ఆయన శాంతింపజేశారు. ప్రతి మండలానికి గోదాములు నిర్మించిన ఘనత తెరాసదేనని హరీశ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయంలో కేవలం 11 వెల మెట్రిక్ టన్నులు నిల్వ చేసే గోదాములు మాత్రమే నిర్మించగా, తెరాస ప్రభుత్వం మూడేళ్లలోనే 2.35 లక్షల మెట్రిక్ సామర్ధ్యం ఉన్న గోదాములు నిర్మించిందని మంత్రి తెలిపారు. నల్గొండలో నెల రోజుల్లోనే బత్తాయి మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. విపక్షాల తీరును మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తప్పుపట్టారు.