ముంబయి అక్టోబర్ 6: ఈ మధ్య ఓ టీవీ షో లో పాల్గొన్న కోహ్లి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. శ్రీలంక పేస్ బౌలర్ మలింగా బౌలింగ్ అంటే తనకు భయమని, అతడి బౌలింగ్ శైలి విభిన్నంగా ఉంటుందని, 2011 ప్రపంచకప్ ఫైనల్స్ లో మలింగ వేసిన యార్కర్లకు భయపడి పోయానని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సంద్భంగా అడిగిన ఓ ప్రశ్నకు కోహ్లి పైవిధంగా సమాధానమిచ్చాడు. దీపావళి పండగ రోజున ఈ షో ప్రసారం కానుంది.