తిరుమల, అక్టోబర్ 5: ఇటీవలే వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా ముగించుకున్న తిరుమలేశుడు.. శుక్రవారం నుంచి భక్తులను అనుగ్రహించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సందర్భంగా తితిదే.. రద్దు చేసిన ఆర్జిత సేవా టిక్కెట్లను శుక్రవారం విడుదల చేయనుంది. ఆన్ లైన్, ఎలక్ట్రానిక్ పద్దతుల ద్వారా ఈ సేవా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. భక్తులు టిక్కెట్లకు నగదును ఆన్ లైన్ లోనే చెల్లించాలి. అయితే తిరుమలలో బుధవారం రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి శ్రీవారి ఆలయంలో మోకాలి లోతు నీరు చేరి, భక్తులు ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. తిరువీధులు, శ్రీవారి ఆలయం ఎదుట ఎప్పుడు లేని విధంగా నీరు ప్రవహించడంతో భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.