స్వచ్ఛ ఆంధ్రాలో పాల్గొన్న విద్యార్ధులకు మార్కులు: నారా లోకేశ్

SMTV Desk 2017-10-05 17:28:47  Andhra pradesh, AP CM, Minister Nara Lokesh, Independent Bharat

అమరావతి, అక్టోబర్ 5 : "స్వచ్ఛ భారత్" కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ తన నివాసంలో స్వచ్చాంద్ర కార్పోరేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి ఆదేశానుసారం 2018 లోపు 21 లక్షల మరుగుదొడ్ల నిర్మాణ౦ ఏవిధంగా కార్యాచరణ రూపొందించాలనే అంశంపై చర్చించారు. అంతేకాకుండా స్వచ్చాంద్రా కార్యక్రమంలో విద్యార్థులను, డ్వాక్రా మహిళలను భాగస్వాములను చేయాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు 5 మార్కులను అదనంగా ఇచ్చే అంశాన్ని పరిశీలించామని అధికారులను సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖమంత్రి, కార్యదర్శి జవహర్ రెడ్డి, కమీషనర్ రామాంజనేయులు, స్వచ్ఛ ఆంధ్రా కార్పోరేషన్ ఎండీ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.