ముంబై, అక్టోబర్ 5 : భారత మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీ వాహనం వచ్చేసింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ‘కొడియాక్’ వాహనాన్ని బుధవారం ప్రవేశపెట్టింది. ఈ వాహన ప్రత్యేకతలు.. 7 సీట్ల సామర్థ్యం, డీజిల్ ఇంజన్ కలిగిన ఈ కారు ధర సుమారు 34,49,501గా ఉండవచ్చని అంచనా. "కొడియాక్" బుకింగులు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయని.. నవంబర్ తొలి వారం నుంచి డెలివరీ ఇస్తామని స్కోడా మార్కెటింగ్ చీఫ్ అశుతోష్ దీక్షిత్ తెలిపారు. ప్రస్తుతం స్కోడా భారత్లో సూపర్బ్, ఓక్టావియా, రాపిడ్ సెడాన్ మోడళ్లను విక్రయిస్తోంది. ఇప్పుడు ఈ కొడియాక్ వాహనం ‘ఫార్చ్యునర్’, ‘ఎండీవర్’, ‘ఎమ్యూ-ఎక్స్’, ‘టిగువా’ లకు గట్టి పోటీ ఇస్తుందని కంపెనీ భావిస్తోంది.