సాక్షి మీడియా చైర్మన్, ఎడిటోరియల్ డైరెక్టర్ కు అరెస్ట్ వారెంట్లు

SMTV Desk 2017-10-05 11:19:12  Sakshi Media Chairman, YS Bharti Reddy, Director K.Ramachandramurthy,.

నూజివీడు, అక్టోబర్ 5 : సాక్షి మీడియా సంస్థలకు చెందిన ఇద్దరు ప్రముఖులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. గత సంవత్సరం సాక్షి దినపత్రికలో విజయ డైరీ డైరెక్టర్ చలసాని ఆంజనేయులు గురించి ఓ కథనం వెలువడింది. దానిపై చలసాని పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సతీమణి భారతి, సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తిలను ఈనెల 16లోగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలంటూ నూజివీడు జ్యుడిషియల్‌ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. భారతి, రామచంద్రమూర్తి తరఫున ఏ న్యాయవాదీ వకాల్తా దాఖలు చేయకపోవడంతో వారికి ఈ వారెంట్లు జారీ అయ్యాయి. అయితే వీరికి గత నెలలోనే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయగా అధికారికంగా ఆ వారెంట్లు పోలీసుల చేతికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై జిల్లా ఎస్పీ, డీజీపీలతో చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తామని పోలీసులు తెలిపారు.