వాషింగ్టన్ అక్టోబర్ 5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి సాధారణంగానే చాల కోపం ఎక్కువ, చాలా సార్లు తన కోపాన్ని మీడియా ముందే చూపించారు. అలాగే మీడియా అంటే ఎంత కోపమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ట్విట్టర్ వేదికగా మీడియాపై విరుచుకుపడుతూనే ఉంటారు. తనకి మీడియా కన్నా ట్విట్టర్ అంటేనే ఇష్టమని అయన చెబుతుంటారు. తాజాగా మీడియాను ఉద్దేశించి ట్రంప్ మరోసారి కామెంట్ చేసారు. ‘వావ్.. ఈ రోజు చాలా ఫేక్ న్యూస్ స్టోరీలు వచ్చాయి.. నేను సరిగ్గా ఏం చెప్పానో, ఏం చేస్తున్నానో మీడియాకు తెలుసుకోవాల్సిన అవసరమేలేదు. మీడియా నిజాలని రాయదు, చెప్పదు. ఫేక్ న్యూస్ మీడియా నియంత్రణ కోల్పోయింది’ అని డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.