న్యూఢిల్లీ, అక్టోబర్ 4 : ప్రస్తుత ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య పదవీకాలం ఈ వారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్మన్ ను అధికారికంగా ప్రకటించారు. ఆయనే "రజనీశ్ కుమార్".. దాదాపు మూడేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 1980 వ సంవత్సరంలో ఎస్బీఐ సంస్థలో ఉద్యోగిగా చేరి పలు విభాగాలలో పనిచేసిన ఆయన ప్రస్తుతం ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కాగా అక్టోబర్ 7, 2013లో ఎస్బీఐ తొలి మహిళ చైర్మన్గా అరుంధతి భట్టాచార్య ఎన్నికైన విషయం తెలిసిందే.