హైదరాబాద్, అక్టోబర్ 4 : కాంట్రాక్టు ప్రాతిపాదికన వైద్య ఆరోగ్యశాఖలో త్వరలోనే 2,100 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కిట్ల పథకానికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ముందు ముందు మరిన్ని మాతా శిశు వైద్యశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తు౦దన్నారు. అలాగే మంచి పనితీరు కనబరచిన ఆశావర్కర్లకు ప్రోత్సాహకాలు అందించాలని, వారికి మరింత శిక్షణను అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అంటువ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మ౦త్రి లక్ష్మారెడ్డి కోరారు.