న్యూఢిల్లీ, అక్టోబర్ 4 : మొదటిసారి భారత్ లో జరగనున్న ఫీఫా అండర్ 17 ప్రపంచకప్ క్రీడలకు సర్వం సిద్దమైంది. తొలిసారిగా ఈ టోర్నమెంట్స్ లో భారత్ జట్టు కూడా పాల్గొంటుంది. మొత్తం ఆరు గ్రూపుల్లో ప్రతి గ్రూపుకు నాలుగు జట్ల చొప్పున 24 జట్లు తలపడనున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు స్టేడియాల్లో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్లను గ్రూప్ ఎ, బీ లుగా విభజించారు. మొదటిరోజు గ్రూప్ ఎ నుండి కొలంబియా, ఘనా జట్లు న్యూ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తలపడనుండగా, గ్రూప్ బి నుంచి న్యూజిలాండ్, టర్కీ జట్లు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో పోటీపడనున్నాయి. ఒకేసారి ఈ రెండు మ్యాచ్ లు రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరగనున్నాయి. కాగా ఈ పోటీలు అక్టోబర్ 6 సాయంత్రం 5 గం.లకు ప్రారంభం అవుతున్నాయి.