అక్రమాస్తుల్లో మరో తిమింగలం...ఏసీబీ

SMTV Desk 2017-10-04 12:44:44  ACB, Anantapur, Senior Assistant Narayana Reddy at Puthundu ICDS

అమరావతి, అక్టోబర్ 04 : అవినీతి నిరోధక శాఖకు మరో అక్రమార్కుడు చిక్కాడు. అనంతపురం జిల్లా పెనుకొండ ఐసీడీఎస్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ నారాయణరెడ్డి రూ.50కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ మేరకు ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల అభియోగాలపై రంగంలోకి దిగిన అధికారులు మొత్తం 8 చోట్ల తనిఖీలు నిర్వహించారు. పెనుకొండ ఐసీడీఎస్‌ కార్యాలయం, అనంతపురం జిల్లాలోని నారాయణరెడ్డి నివాసం, కొవ్వూరునగర్ లోని ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు సాగుతున్నాయి. అనంతపురం, ధర్మవరం, చిత్తూరు జిల్లా పాకాలలో మొత్తం 7 భవనాలు ఉన్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో నారాయణరెడ్డికి 10కి పైగా ఇళ్ల స్థలాలు, అలాగే వ్యవసాయ భూములు ఉన్నట్లు కనుగొన్నారు. బంగారు, వెండి, ఆభరణాల విలువలు గణిస్తున్నారు.