ఎయిర్‌ ఏషియా బంపర్ ఆఫర్

SMTV Desk 2017-10-03 18:24:22  air asia, Airline company,

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: విమానయాన సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వదేశీ మార్గాల్లో కనీస ఛార్జీలను రూ.1299, విదేశీ మార్గాల్లో రూ.2,399లకు తగ్గించింది. ఈ ఆఫర్‌ కోసం అక్టోబర్‌ 2 నుంచి 15లోపు టికెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సోమవారం అర్ధరాత్రి నుంచే టికెట్ల బుకింగ్‌ ప్రారంభమైంది. అక్టోబర్‌ 2 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 మధ్య కొనసాగే ప్రయాణాలకు ఇది వరిస్తుంది. స్వదేశీయంగా హైదరాబాద్‌, కోల్‌కతా, కొచ్చి, న్యూఢిల్లీ, రాంచీ, పుణే తదితర మార్గాల్లో ప్రయాణికులు దీనిని వినియోగించుకోవచ్చు. అంతర్జాతీయంగా కౌలాలంపూర్‌, బాలి, బ్యాంకాక్‌, మెల్‌బోర్న్‌, సిడ్నీ, సింగపూర్‌, ఆక్లాండ్‌తో పాటు వివిధ ప్రాంతాలలో ఆసియాఖండంలోని 120 మార్గాలకు ఈ సదుపాయం కల్పించినట్లు సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ ఆఫర్ ఎయిర్‌ ఏషియా అధికారిక వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా బుక్‌చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని వారు తెలిపారు.