వాషింగ్టన్, అక్టోబర్ 03 : అమెరికాలోని లాస్వెగాస్లో ఓ దుండగుడు సృష్టించిన అలజడి తలుచుకుంటూ అమెరికన్ టీవీ హోస్ట్ జిమ్మి కిమ్మెల్ ప్రత్యేక ప్రసారంలో మాట్లాడి అక్కడ జరిగిన ఘటనను ఆయన వివరించడం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. ఓ సాయుధుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 58 మంది మృత్యువాతపడ్డారు. దీనిపై జిమ్మి స్పందిస్తూ... సాటి మనిషి అని కూడా చూడకుండా ఇంత దారుణానికి పాల్పడడానికి గల కారణం అర్ధం కాకుండా ఉందన్నారు. ఈ సందర్భంగా లాస్వెగాస్లో జరిగిన దారుణ ఘటనలో బలైన బాధితులకు కన్నీరుతో ప్రగాఢ సానుభూతి తెలిపారు.