న్యూఢిల్లీ, అక్టోబర్ 3 : భారత రిజర్వు బ్యాంకు మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇటీవల పాత నోట్లను రద్దు చేసిన అనంతర౦ కొత్త నోట్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్బీఐ కొత్త రూ.100నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నోట్లకు సంబంధించిన ముద్రణ ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పుడున్న 100 రూపాయల నోటు సైజులో ఎలాంటి మార్పు చేయకుండానే ముద్రణను చేపట్టనున్నట్లు ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ కొత్త రూ.100నోటు అందుబాటులోకి తీసుకురానున్నారు.