హైదరాబాద్, సెప్టెంబర్ 27 : హైదరాబాద్ లో ఒప్పంద వివాహాలకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరులో ముగ్గురు ఒమాన్ దేశస్థులతో పాటు ఇద్దరు ఖాజీలు ఉన్నారు. హైదరాబాద్ ఖాజీ చీఫ్ అలీ అబ్దుల్ రఫీ అతని అనుచరుడు అబ్రహాం నిందితుల్లో ఉన్నారు. ఇటీవల నిందితులు తెలిపిన వివరాల ఆధారంగా పాతబస్తీలో తాజాగా పలువురిని ఆదుపులోకి తీసుకున్నారు. ఖాజీల వద్ద పత్రాలతో పాటు నకిలీ రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఒప్పంద విభాగాల వ్యవహారంలో ఇప్పటి వరకు 38 మంది బ్రోకర్లను గుర్తించమని డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. ఒక్కో యువతికి 3 లక్షల నుంచి 7 లక్షల వరకు చెల్లించి వివాహాలు చేసుకుంటున్నారని తెలిపారు.