హైదరాబాద్, సెప్టెంబర్ 27 : మంత్రి కేటీఆర్ పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తుంటే.. శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ మాత్రం విమర్శలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ బిల్లులోనే ఎన్నారై బిల్లు తీసుకురావాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల్లో వేలాది మంది తెలంగాణ కార్మికులు జైలల్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హాయంలో ఒక్క ఏడాదిలోనే 25 వేల మందిని ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి రప్పించమని అలీ గుర్తు చేశారు. ప్రవాసభవనం నిర్మిస్తానన్న ప్రభుత్వం ముందుగా అద్దె భవనంలోనైన కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన సూచించారు.