చండీగఢ్, సెప్టెంబర్ 26: ‘బ్లూ వేల్’ సూసైడ్ చాలెంజ్ గేమ్ భారత్ లో మరో విద్యార్ధి ప్రాణాలు తీసిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పంచకులలో శనివారం 17 ఏళ్ల విద్యార్ధి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్ధి తన డైరీ లో రాసుకున్న సమాచారాన్ని సేకరించి, శరీరంపై ఉన్న చిత్రాలను ఆధారంగా ‘బ్లూ వేల్’ ఆట ప్రభావంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పంచకుల డీసీపీ మన్బీర్ సింగ్ తెలిపారు. కొడుకు మృతిపై తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ అన్ లైన్ గేమ్.. ‘బ్లూ వేల్’ ను నిషేధించినప్పటికీ యువతను దాని ఆలోచనలతో వెంటాడుతూ చంపేస్తుంది.