హైదరాబాద్, సెప్టెంబర్ 25 : శంషాబాద్ సమీపంలోని సిద్దాంత ప్రాంతం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వైసీపీ కార్యదర్శి మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు యం.డీ. అజాం అలీ మృతి చెందారు. ఆయన మహబూబ్ నగర్ లోని కోయిల కొండకు వెళ్లి వస్తున్న క్రమంలో, శంషాబాద్ సిద్దాంత సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి డివైడర్ ను డీకొ౦ది. తీవ్ర గాయాలపాలైన అజాం అలీని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా అజాం అలీ మరణం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.