ముంబై, సెప్టెంబర్ 25 : దసరా పండగను పురస్కరించుకొని డిష్ టీవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. "హెచ్డీ ఫర్ ఆల్ ఇన్షియేటివ్" అనే పేరుతో వినియోగదారులందరూ హెచ్డీ ఛానెల్స్ను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎస్డీ, హెచ్డీ అనే భేదం లేకుండా అందరికి హెచ్డీ ఛానళ్ళను అందించడమే లక్ష్యంగా ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టినట్లు డిష్ టీవీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ దువా తెలిపారు. ఈ సందర్భంగా కొత్త హెచ్డీ సెట్టాప్ బాక్స్ "డిష్ ఎన్ఎక్స్టీ హెచ్డీ" ని విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12.8 మిలియన్ల మంది వినియోగదారులు హెచ్డీ సెట్టాప్ బాక్సులను వినియోగిస్తున్నట్లు అనిల్ దువా తెలిపారు.