కోల్ కతా, సెప్టెంబర్ 25 : తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత ముకుల్ రాయ్ ఆ పార్టీ నుంచి వైదొలగారు. దుర్గ పూజ తరువాత పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కొన్నాళ్లుగా భాజపాతో సఖ్యతగా ఉంటున్న ముకుల్ రాయ్ ఆ పార్టీలో చేరతానని భావిస్తున్నారు. ఇటీవల భాజపా నేతలతో పాటు రాష్ట్రపతి కోవింద్ ను కలిసిన ముకుల్ తాజాగా టీఎంసీ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. మమతా బెనర్జీ తరువాత పార్టీలో కీలక నేతగా పేరు తెచ్చుకున్న ఆయనకి కొంతకాలంగా మమతా బెనర్జీతో విబేధాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అధినేత్రి ఆయనను వివిధ బాధ్యతల నుంచి తప్పించారు. గతంలో యునైటేడ్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో పని చేసిన ముకుల్ తృణమూలలో చేరి 2006 నుంచి ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్నారు.