అబుదాబి, సెప్టెంబర్ 25 : ప్రపంచంలోనే అత్యంత భారీకాయురాలు ఎమాన్ అహ్మద్ మృతి చెందారు. గత కొంతకాలంగా బరువు తగ్గడం కోసం అబుదాబిలోని బుర్జీల్ ఆస్పత్రిలో, 20 మంది స్పెషలిస్టుల సమక్షంలో ఎమాన్ చికిత్స చేయించుకుంది. మొదట ఇక్కడి సైఫీ ఆస్పత్రిలో కొంతకాలం చికిత్సను అందించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను అబుదాబిలోని బుర్జీల్ ఆస్పత్రికి తరలించారు. అయితే గత వారం నుండి ఆమె పరిస్థితి మరింత క్లిష్టంగా మారినట్లు వైద్యులు తెలిపారు. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు రావడంతో మెరుగైన చికిత్సను అందించడానికి వైద్యులు ఎంత ప్రయత్నించినా వీలుపడలేదు. పరిస్థితి చేయి దాటి పోవడంతో ఎమాన్ చికిత్స తీసుకుంటూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఈజిప్టుకి చెందిన ఎమాన్ ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా రికార్డుకెక్కిన విషయం విదితమే.