రెండు చోట్ల బాణసంచా పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలు

SMTV Desk 2017-09-25 14:08:06  Jharkhand bangal, fire accident

రాంచీ, సెప్టెంబర్ 25 : ఝార్ఖండ్‌, బంగాల్ ల లోని రెండు బాణాసంచా పరిశ్రమల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కుమార్డుబి ప్రాంతంలో ఉన్న బాణసంచా పరిశ్రమలో అగ్ని ప్రమాదంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడగా, ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 25మంది గాయపడగా అధికారులు వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 యంత్రాలతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఇది ఎలా ఉండగా ఉత్తర 24 పరగణ జిల్లా ఆమ్డాంగాలోని బాణాసంచా గోదంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 20 మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.