గౌరీ లంకేష్ సంఘటన మరువక ముందే మరో పాత్రికేయుడి పై దారుణం...

SMTV Desk 2017-09-24 15:08:25  Journalist k.j.sing , mother gurucharan kour, Murder in panjab Chief Minister Amarender Singh, police

పంజాబ్, సెప్టెంబర్ 24 : పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య జరిగి 20 రోజులైనా కాకముందే మరో ప్రముఖ పాత్రికేయుడు హత్యకు గురైయాడు. ఇండియన్ ఎక్ష్స ప్రెస్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికల్లో పనిచేసి ప్రస్తుతం ఓ కెనడియన్‌ పత్రికకు పని చేస్తున్న సీనియర్ పాత్రికేయుడు కె.జె సింగ్ ను గుర్తు తెలియని దుండగులు శనివారం పంజాబ్ లోని మొహాలిలో ఆయన సొంత ఇంట్లోనే మధ్యాహ్నన సమయంలో హతమార్చారు. ఆయన తల్లి గురు చరణ్ కౌర్ ను కూడా హత్య చేశారు. కె.జె సింగ్ తల్లి(92) చాలాకాలంగా మంచంలోనే ఉన్నారు. అయితే, దుండగులు తల్లిని గొంతు నులిమి చంప్పగా సింగ్ ను కత్తితో పొడిచి హతమార్చారు. హత్య తరువాత కె.జె సింగ్ ఇంట్లో ఫోర్డ్‌ ఐకాన్‌ కారు, ఎల్‌ఈడీ టీవీలు కనిపించకుండా పోగా, ఆయన మెడలోని బంగారు గొలుసు తల్లి పక్కన పరుసులోని 25 వేల నగదు అలానే ఉన్నాయి. పోలీసులు చెప్పిన వివరణ ప్రకారం దుండగులు కావాలనే దోపిడిగా చిత్రీకరించరాని హత్యలకు అది కారణం కాకపోవచ్చునని నిర్ధారణకు వచ్చారు. భారత జన్నలిస్ట్ లా సంఘం సహా ఈ దారుణాన్ని పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటన పై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ప్రకటించారు.