సిడ్నీ, సెప్టెంబర్ 23: అంతర్జాతీయ స్థాయిలో ఐఫోన్లు అమ్మకాలలో ఎప్పుడు ముందంజలోనే ఉంటుంది. ఈ రోజు నుంచి ఆస్ట్రేలియాలో సరికొత్త ఫీచర్స్ తో ఐఫోన్-8, ఐఫోన్-8ప్లస్ ఫోన్లు ప్రారంభమయ్యాయి. అయితే తొలి ఐఫోన్-8 తనకే దక్కాలని సిడ్నీకి చెందిన మేజెన్ పది రోజుల ముందు నుంచే స్టోర్ ముందు కూర్చున్నాడు. యూనివర్శిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్లో ఇంజినీరింగ్ చదువుతున్న మేజెన్ ఐఫోన్ని సొంతం చేసుకున్న వెంటనే, ఫోన్ రివ్యూ వీడియోని యూ ట్యూబ్లో ఉంచాడు. ఇప్పటికే ఐఫోన్-7 కొనుగోలు చేసిన వారిలో మేజెన్ది మూడో స్థానం. ఈ ఫోన్లను సొంతం చేసుకునేందుకు ఉదయం నుంచే స్థానిక జార్జి స్ట్రీట్లో గల యాపిల్ షోరూం వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఐఫోన్ 8, 8ప్లస్ ఫోన్లు భారత్లో సెప్టెంబరు 29 నుంచి అందుబాటులో రానున్నాయి. 64జీబీ, 256 జీబీ వేరియంట్లతో ఉండే ఈ ఫోన్ల ధర భారత్ లో రూ.64,000 నుంచి ప్రారంభంకానుంది.