ముంబై, సెప్టెంబర్ 22 : భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన అభిమాన నటితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇంతకు యువీ కలల రాణి ఎవరు అని ఆలోచిస్తున్నారా.! ఎవరో కాదండీ... ప్రముఖ కథానాయిక కాజోల్. తాజాగా వీరిద్దరూ ఓ ఎయిర్ పోర్టులో తారసపడి, ఒకరికొకరు పలకరించుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోనే ఇది..! ఈ ఫోటోను యువరాజ్ సింగ్ పోస్ట్ చేస్తూ.. "విమానం ఆలస్యం కావడంతో అభిమాన నటితో యువీ సెల్ఫీ టైం" అని పేర్కొన్నాడు. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే ఫోటోను కాజోల్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకోవడం విశేషం. కాగా బీసీసీఐ శ్రీలంక, ఆసీస్తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో యువీకి స్థానం కల్పించని సంగతి విధితమే.