గ్రూప్‌-1 ఫలితాల విడుదలకు లైన్‌క్లియర్‌

SMTV Desk 2017-09-22 10:06:49  group2, highcourt, tspsc

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ -1 ఫలితాలు విడుదలకు మార్గం సుగమమైంది. ఈ పరీక్ష రాసిన తర్వాత తనను అనర్హుడిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ గతంలో శ్రీకాంత్ రెడ్డి అనే అభ్యర్ధి హైకోర్ట్ ను ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారించిన ఉన్నత న్యాయస్థానం ఒక్క పోస్టును పక్కనపెట్టి నియామక ప్రక్రియను చేపట్టవచ్చని గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఏ పోస్టును ఏ విధంగా పక్కన పెట్టాలో స్పష్టత ఇవ్వకపోవడంతో ఇంటర్వ్యూలు పూర్తయినప్పటికీ టీఎస్‌పీఎస్సీ ఫలితాలను వెల్లడించకుండా నిలిపివేసింది. ఇవాళ శ్రీకాంత్‌రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఫలితాల వెల్లడికి లైన్‌ క్లియరైంది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో టీఎస్పీఎస్సీ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతోంది. ఫలితాలు వెల్లడించేందుకు మార్గాలను పరిశీలిస్తోంది.