హైదరాబాద్ సెప్టెంబర్ 22: ఐశ్వర్య రాయి, రాజ కుమార్ రావు మరియు అనిల్ కపూర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫన్నీ ఖాన్’. అయితే ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు తో సన్నిహిత సన్నివేశాలకు ఐశ్వర్య ఒప్పుకోలేదని సమాచారం. అయితే ఐశ్వర్య ఇంతకు ముందు ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలో రణ్బీర్ కపూర్తో కలిసి రెచ్చిపోయి నటించింది. కానీ ఇపుడు ఈ నిర్ణయాన్ని తీసుకోడానికి గల కారణం, ఆ సినిమాలో సీన్లు చూసిన అత్తమామలు అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ లు కొంత అసహనానికి గురి కావడమే ఐశ్వర్య తాజా నిర్ణయానికి కారణమని చెబుతున్నారు. ఐశ్వర్య నటిస్తున్న ‘ఫన్నీ ఖాన్’ చిత్రం 2000లో వచ్చిన డొమినిక్ డ్యూరుడెరే ఆస్కార్ చిత్రం ‘ఎవిరీబడీ ఫేమస్’ చిత్రానికి స్ఫూర్తి. ఈ సినిమాకి దర్శకత్వం అతుల్ మంజ్రెకర్ వహిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.