చెన్నై, సెప్టెంబర్ 21: గత కొద్ది కాలంగా తమిళ రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. దీనికి తోడు ఇటీవల విలక్షణ నటుడు కమలహాసన్ రాజకీయాలలోకి ప్రవేశం చేస్తానని వెల్లడించారు. తాజాగా చెన్నై పర్యటనలో భాగంగా ఆమ్ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కమల్హాసన్ నివాసానికి వచ్చారు. క్రేజివాల్ కు కమలహసన్ ఘన స్వాగతం పలికారు. ఈ నేపధ్యంలో కమల్, క్రేజివాల్ మీడియాతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మొదట ఎవరివో అరుపులు వినిపించాయి, దీంతో గందరగోళం నెలకొంది. వెంటనే ఉన్నవారంత నిశబ్దంగా ఉండాలని, అక్కడి భద్రత సిబ్బంది సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రధాన౦గా రాజకీయాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇటీవల కమల్హాసన్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో సమావేశమైన విషయం తెలిసిందే.