హైదరాబాద్, సెప్టెంబర్ 21 : నిన్నటి వరకు టమాటా నాణ్యతను బట్టి కిలోకు రూ. 25 ఉన్న ధర కాస్త.. నేడు ఒక్కసారిగా పడిపోయింది. ఈ పరిణామంతో రైతులలో తీవ్ర ఆందోళన నెలకొంది. నేడు హైదరాబాద్ మార్కెట్ కు రైతులు భారీ ఎత్తున టమాటాలను తీసుకురావడంతో వాటి కొనుగోలు సంఖ్య తగ్గింది. దీంతో వాటిని కొనే వారు లేక కిలో రూ. 25 ఉన్న ధర కాస్త.. నేడు రూ. 8 కి పడిపోయింది. దీంతో తమకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు నిరసనలకు దిగారు. కనీసం తమకు రవాణా చార్జీలు కూడా మిగలలేని పరిస్థితి ఉందని, అమ్మకుండా మిగిలిపోయిన టమాటాలను తిరిగి వెనక్కి తీసుకెళ్ళే అవకాశం లేదని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాల౦టూ కోరుతున్నారు.