ముంబై, సెప్టెంబర్ 21 : సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన "పద్మావతి" చిత్రంలో ప్రముఖ కథానాయిక దీపిక పదుకొనే టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చిత్ర యూనిట్.. దీపికా ఫస్ట్లుక్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ కూడా దీపికా పదుకొనే లుక్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. కాగా ఈ ఇద్దరు హీరోలు ఈ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ(రణ్వీర్), రావల్ రతన్ సింగ్(షాహిద్ కపూర్) పాత్రలను పోషిస్తున్నారు. ఈ "నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఛిత్తోడ్ మహారాణి పద్మావతిని కలుసుకోండి" అంటూ దీపికా పేర్కోవడం విశేషం. కాగా ఇలాంటి మహారాణి వంటి పాత్రలు చేయడం దీపికాకు కొత్తేమి కాకపోయినా.. ఈ పద్మావతి చిత్ర౦ ఫస్ట్లుక్ లో మాత్రం ఏదో ఒక కొత్తదనం ఉందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1 న విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.