న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ వెళ్లిన భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇవాంక తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ... "సుష్మాస్వరాజ్ను కలుసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా.. "సుష్మాజీ ఆకర్షణీయమైన" విదేశాంగ మంత్రి అంటూ అభివర్ణించారు. అంతేకాకుండా నవంబర్ లో జరగనున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్(జీఈఎస్), మహిళా సాధికారత, యూఎస్-భారత్ లో శ్రామికాభివృద్ధికి సంబంధించి చర్చలు జరిపాం" అంటూ తెలియజేశారు. అయితే వచ్చే నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో జరగనున్న జీఈఎస్ సదస్సుకు ఇవాంక అధ్యక్షత వహించనున్నారు.