చెన్నై, సెప్టెంబర్ 18: తమిళనాడులో ఆ హీరోయిన్ కు ఏకంగా ఓ గుడి కట్టించి, పూజలు చేస్తున్నారు. ఇంతకీ ఎవరా దేవత అని అనుకుంటున్నారా..? ఆమె మరెవరో కాదండోయ్ దక్షిణ సినీ పరిశ్రమలో ఒకప్పటి అగ్రకథానాయిక ఖుష్బూ. ఈ దేవత ఒక వ్యక్తిని దర్శించుకోవడానికి ఏళ్ల తరబడి నిరిక్షించారట. ఆయన ఎవరో కాదు మన టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి. తాజాగా ఖుష్బూ తన ట్విట్టర్ లో..." నా కల నిజమైంది. చివరికి నా నిరీక్షణ ఫలించింది. ఆయన్ని కలవడానికి 33 ఏళ్లుగా ఎదురుచూశానని" ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రవిశాస్త్రితో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఖుష్బూ పవన్కల్యాణ్ 25వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కు అత్తగా నటించబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్.