కరీంనగర్, సెప్టెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటైనా హరితహారం మూడో విడత నిర్వహించిన సంగతి విదితమే. ఈ గొప్ప కార్యక్రమాన్ని కేవలం మొక్కలు నాటడమే మా పని వాటి పర్యవేక్షణ మాకు అవసరం లేదు అన్నట్లు సాగిస్తున్నారనటానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ నాటిన మొక్కే నిదర్శనం అని చెప్పవచ్చు. హరితహారం మూడో దశలో భాగంగా సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా మానేర్ కట్ట దిగువన మహాఘని మొక్కను నాటారు. అయితే ఆ మొక్క ప్రస్తుతం వాడిపోయి, నిర్జీవ స్థితిలో ఉంది. దీంతో సీఎం నాటిన మొక్క పరిస్థితే ఇలా ఉంటే మరి మిగతా మొక్కలు సంగతి అంటూ స్థానికులు హెద్దేవా చేస్తున్నారు.